గిరిసేన జనసేన- జనం వద్దకు- జనసేన 34వ రోజు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన సోమవారం 34వ రోజు భాగంగా బొడ్లపాడు గ్రామంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి జనసేన జానీ పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ మా గ్రామంలో గ్రామ దేవత మూగుబోలమ్మ తల్లి గుడికి వెళ్ళాలి అంటే మార్గం లేక అలాగే సంత్సరానికి ఒక్కసారి వచ్చే వారాలు పండగకు గ్రామ దేవత గుడికి వెళ్ళడానికి ఊరు జనం భక్తులు చాలా అవస్థలుపడుతున్నారని ఎటువైపు చుసినా సరే చాలా దారుణంగా ఉండటంతో స్థానిక నాయుకులు పట్టించుకోవడానికి సరైన నాయకత్వం లేక ప్రజలు దశబ్దాలు కాలంగా అలానే ప్రయాణం చేస్తుండటం తీవ్రంగా కలిసి వేస్తుందని జనసేన జానీ నిలదీయడం జరుగుతుంది. ఊరులో కొన్ని వీధులలో కాలువలు కూడా లేకుండా రోడ్లు వెయ్యకపోవడం. వల్లన నీరు అనేది ఎక్కడికి అక్కడే ఉండిపోవడం వల్లన నడవటానికే భయం కరంగా ఉన్నది దాని వల్లన మలేరియా డెంగ్యూల బారిన పడి అనేకమైన రోగాలు కూడా దారితీస్తున్నాయి కనుక ఊరు అభివృద్ధి బాధ్యత ప్రజలు ప్రశ్నించినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమైనంతగా సాధ్యం అవ్వుతుంది అని మన ఊరుని నాయుకులు ఎలాగో బాగుచేయరు. కనుక ప్రజా పరిపాలన రావాలి అని అందుకు జనసేన పార్టీకి ప్రతి ఒక్కరు అండగా ఉండాలి అని జనసేన జానీ తెలిపారు.