తూమాటి చిన్నపనాయుడుకు న్యాయం చేయండి: కనపర్తి మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం: తూమాటి చిన్నపనాయుడు గారికి న్యాయం చేయండి అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. పొన్నలూరు మండలం, పెదవెంకన్నపాలెం గ్రామానికి చెందిన తూమాటి చిన్నప్ప నాయుడు పెద వెంకన్నపాలెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పంచాయతీ బిల్లులు ఇప్పటివరకు ఇవ్వలేదు, అధికారులు చుట్టూ తిరిగినా వారు పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఇప్పటివరకు గ్రామంలో ఎల్ఈడి బల్బులు, శానిటైజర్లు ఇవ్వకుండానే బిల్లులు పెట్టుకోవడం జరిగింది, పాత బిల్లులు పక్కనపెట్టి కొత్త బిల్లులు తెచ్చుకోవడం జరిగింది. అధికారులను అడిగితే పంచాయితీలో నిధులు లేవని సమాధానం చెబుతున్నారు, గత ఐదు సంవత్సరాల నుంచి పంచాయతీలో నిధులు లేవని సమాధానం చెబుతూ వస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు చిన్నప్ప నాయుడుకి న్యాయం చేయాలని జనసేన పార్టీ నుండి విజ్ఞప్తి చేశారు.

.