దల్లి గోవింద్ రెడ్డి చొరవతో గొడ్డువానిపాలెం రోడ్డు

విశాఖపట్నం, 64వ వార్డు జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి చొరవతో ఇన్నాళ్ళుగా ఇబ్బందులకు గురవుతున్న గొడ్డువానిపాలెం రోడ్డును ఒక నేషనల్ హైవే రోడ్డులా వేయించటం జరిగింది. స్వయాన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి ఆ రోడ్డు నాణ్యతను పర్యవేక్షించి రోడ్ కాంట్రాక్టర్ తో మాట్లాడి ఇక్కడ ఉన్న సచివాలయం, ప్రాథమిక పాఠశాలకు చాలా మంది చిన్నారులు, మహిళలు పెద్దవారు వస్తుంటారని చెప్పి వాళ్లకు వాహనదారుల నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా వాహనదారుల వేగాన్ని తగ్గించేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ ని వేయమని చెప్పటం జరిగింది. ఇంతటి చక్కటి రోడ్డును వేయించినందుకు ప్రజలు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డిని అభినందించటం జరిగింది.