తేజస్విని కి న్యాయం జరగాలని గోరంట్ల జనసేన కొవ్వొత్తుల నిరసన

గోరంట్ల, గత రెండు రోజుల క్రితం దారుణ హత్య కాబడిన బోయ తేజస్విని కి న్యాయం జరగాలి అని గోరంట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు భారీ ఎత్తున కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.. బస్టాండ్ ఆవరణలో రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన 3 రోజులు కావొస్తున్నా ప్రభుత్వం దీనిపై ఎందుకు స్పందించలేదు..? రాష్ట్రంలో మహిళల పై రోజుకో అత్యాచారం జరుగుతున్నా దిశా చట్టం ఎందుకు పనిచేయడం లేదు..? అధికారులు ఇప్పటికి అయిన స్పందించి తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలని.. ఈ విషయం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్ననే ఈ ఘటన స్పందిస్తూ దోషులకు కఠిన శిక్షలు పడాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అన్నారు. తేజస్విని కి న్యాయం జరిగే వరకు ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, నాయకులు వెంకటేష్, గొల్ల అనిల్ కుమార్, సంతోష్, నాగేంద్ర, మల్లికార్జున, బాబావలి, బాలు, రమేష్, అనిల్, నరేంద్ర, ఆటో రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.