రాజారెడ్డిపై దాడిని ఖండించిన గోరంట్ల జనసేన నాయకులు

పెనుకొండ: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అనుచరుడు అయిన రాజారెడ్డిపై శనివారం ధర్మవరంలో అధికార పార్టీకి చెందిన కొందరు దాడి చేశారు. ఈ సందర్భంగా గోరంట్లలో జనసేన నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇష్టానుసారంగా ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు ధర్మవరం నియోజకవర్గంలో జనసేన నాయుడు చిలకం మధుసూదన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని ధర్మవరం ఎమ్మెల్యే కేతి రెడ్డి వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో జనసేన నాయకులపై దాడులు చేపిస్తూ ఒక ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు సృష్టిస్తున్నారు ఇంతకు ముందు కూడా బీజేపీ నాయకులపై ప్రెస్ క్లబ్ లోనే దాడి చేయించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఇలా దాడులు చేస్తార దీనిని పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకో 6 నెలల్లో ఈ అధికార పార్టీని ప్రజలు ఇంటికి పంపిస్తారు అలాగే ధర్మవరం లో కూడా 2024 తరువాత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారికి కూడా అక్కడి ప్రజలు తగిన బుద్దిచెబుతారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ధర్మవరం లో 2024 లో చిలకం మధుసూదన్ రెడ్డి గారు కచ్చితంగా గెలిచి తీరుతారు అని తెలియజేసారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్. సంయుక్త కార్యదర్శి వెంకటేష్. కార్యక్రమాల కమిటీ సభ్యులు పొగతోట వెంకటేష్. మండల అధ్యక్షుడు సంతోష్. నాయకులు. నరేష్. శ్రీనివాసులు. శ్రీరాములు గౌతమ్. నాగేష్ తదితరులు పాల్గొన్నారు.