ఇకపై ప్రభుత్వ జీవోలు తెలుగులోనూ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జీవోలు, సర్క్యులర్‌లు, ఆర్డర్లు ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. ప్రజలకు సమాచారం సౌలభ్యంగా ఉండేలా అధికారులు వ్యవహరించాలని సీఎం సూచించారు.