అంగనవాడీలపై ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి

పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండల పట్టణంలో గత 10 రోజులుగా సాగుతున్న అంగనవాడి సమస్యల పరిష్కారానికి చేస్తున్న నిరావధిక సమ్మెకు నేడు జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగ కృష్ణ, మండల ఉపాధ్యక్షులు తీగల గోపాలకృష్ణ, ఏడుకొండలు అధికారిక ప్రతినిధి మెట్టా బుచ్చిరాజు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ చిర్రి బాలరాజు సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు వారి సమస్యలు చిర్రి బాలరాజుకి విన్నవించుకున్నారు. అంగన్వాడి కేంద్రాల తాళాలు సచివాలయం సిబ్బంది పగలు కొట్టడం విస్మయానికి గురి చేసిందన్నారు. దేవాలయంలా భావించే అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం ఏంటని మండిపడ్డారు. అంగన్వాడీలు కోరుకునే 26,000 కనీస వేతనం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాట్యుటీ అమల్లోకి తీసుకురావడం, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనాల్లో సగం పింఛన్, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించడం, లబ్ధిదారులకు సరైన సరుకులు అందించడం తదితర డిమాండ్లను వెంటనే ప్రభుత్వంతీర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలు తీర్చడంలో మద్దతుగా నిలిచినటువంటి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, ఇన్చార్జి చిర్రి బాలరాజు, జిల్లా కమిటీ, మండల కమిటీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ సిఐటియు యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పూనెం రాజా కొక్కెర పద్మరాజు, ఇనులముల పున్నారావు, జోడెం కృష్ణమూర్తి, కైగల సూరిబాబు, కూరం దుర్గారావు, మాణికల దుర్గారావు, మిరియాల సతీష్, కందుకూరి వెంకటేష్, ఆకుల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.