రోడ్ల దుస్థితిపై సర్కారు మొద్దునిద్ర వీడాలి: నార్పల జనసేన

*3 వ రోజు #GoodMorningCMSir

అనంతపురం జిల్లా, శింగణమల నియోజకవర్గం, నార్పలమండలం: ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి పై నిద్రపోతున్న ముఖ్యమంత్రి మేల్కొలిపే కార్యక్రమంలో భాగంగా 3 వరోజు నార్పల మండలం, నార్పల గ్రామంలోని బేల్దారి కాలనీల జనసైనికులు వినోదం లోకేష్, భరత్, శరత్ లతో కలసి సందర్శించడం జరిగింది. అద్వాన్నంగా మురుగునీరు మొత్తం రోడ్లపై ప్రవహిస్తూ నిత్యం కాలని వాసులు దోమలు, పందులు, పాముల బెడదతో చిన్నపిల్లలు బయటికి పంపాలంటే మురుగునీటి గుంటల్లో పడిపోతారనే భయం భయంగా ప్రతిరోజు బతుకుతున్నామని.. అధికారులు, నాయకులు వచ్చి వెళ్లడమే కానీ సమస్య పరిష్కరం కాలేదంటూ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జనసేన పార్టీ తరఫున మీరైనా నా ఈ సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కాలనీవాసులు కోరగా.. కచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద స్థాయిలో ఉద్యమం చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చంద్ర, నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ బేల్దారి, కాలనీ జనసైనికులు లోకేష్, భరత్, శరత్ మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.