సీఎం గారు మీరు మీ బృందం మొద్దు నిద్రను వీడoడి

*3 వ రోజు #GoodMorningCMSir

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం జనసేన జానీ పుండరికం బృందం మూడవ రోజు పరియటనలో భాగంగా జనసేన జానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి మూడు సంత్సరాలు దాటినా ఆంధ్రప్రదేశ్ రోడ్ల విషయంలో కనీసం ఏ ఒక్క మంత్రి గానీ యమ్ యల్ ఏ గానీ.. యమ్ యల్ సి గానీ పట్టించుకోకపోతే జనసేనాని పిలుపు మేరకు రాష్ట్ర జనసైనికులు రోడ్లు మీదకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొద్దు నిద్రనీ లేపే కార్యక్రమం GoodMorningCMSir చేపట్టదం జరిగింది. రహదారులు గోతులు, గొయ్యలు ఈ నెల 15 కళ్ల రోడ్లు పూర్తిచేస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.. కానీ ఇప్పటికి పూర్తి కాకపోవడం వల్లన ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని చుస్తే వాహనాలు నడపడానికి గానీ.. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కి ప్రయాణించడం అంటే ప్రాణాలుతో చెలగాటమే అవ్వుతుంది అని.. ఈ వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మూడవ రోజు జనసేన జానీ బృందం వీరఘట్టం మండలం చిట్టపూడివలస గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జానీ ఈ సమస్యలపైన ప్రభుత్వం కి వివరించడం జరిగింది. ఈలాంటి సమస్యలపై ప్రజలే పాలకులుని నీలాదియ్యాలి అందుకు జనసేన ఎప్పుడు అండగా ఉంటుంది అని జనసేన జానీ చెప్పడం జరిగింది. ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దగ్గరకి డిజిటల్ క్యాంపెయిన్ లో పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా జనసేన జానీ వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వీరఘట్టం మండల జనసేన నాయుకులు పుండరికం, వెంకట్ నాయుడు, సాయిపవ,న్ సుమన్, ప్రణీత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.