అద్వానంగా ఉన్న రహదారులపై జనసేన డిజిటల్ క్యాంపెన్

*ప్లకార్డులను పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన జనసేన నాయకులు

సిద్ధవటం: రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. రాష్ట్రంలో రోడ్ల అధ్వాన పరిస్థితులు తెలియజేస్తూ.. గాఢనిద్రలో ఉన్న సీఎంను నిద్ర లేపడానికి రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకట రమణ ఆదేశాల మేరకు.. సిద్ధవటం జనసేన యువ నాయకుడు పసుపులేటి కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ.. కొనసాగుతున్న గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెన్ మూడోరోజులో భాగంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని సిద్ధవటం నుండి యస్.రాజంపేట, నిత్యపూజ కాలనీ, జ్యోతిగ్రామాల గుంటలవద్ద ప్లకార్డులు పట్టుకొని గుడ్ మార్నింగ్ సీఎం మారోడ్లు బాగుచేయండి అంటూ, డిజిటల్ ప్రోగ్రాం ద్వారా కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన యువ నాయకులు పసుపులేటి కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో రహదారులు మృత్యు ద్వారాలను తలపిస్తున్నాయన్నారు. రోడ్లు అంతా గుంతల మయం కావడంతో ప్రజలు రోడ్డు ప్రయాణం చేయడానికి భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారులను మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో నిరసనలు మరింత ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆవులరాజా, పాలకొండరాయుడు, అల్లంశివ, అతికారి బాబు, కొట్టేరాజేష్, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.