నష్ట పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి: యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట మండలం లోని శేషమాంబా పురం పంచాయితీ బాలిరెడ్డి పల్లె లో మిగ్ జాం తుఫాన్ కారణంగా పంట చేతికి వచ్చే సమయానికి ఏకధాటిగా కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి కంటితుడుపు చర్యలు కాకుండా నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరహారం చెల్లించాలని జనసేన పార్టీ తరపున యల్లటూరు శ్రీనివాసరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు రైతులతో మాట్లాడుతూ రైతుల పక్షాన జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులుజి నరసింహ రాజు, రాజేష్ వర్మ, పి శ్రీను, సుబ్రహ్మణ్యం రాజు, రవీంద్ర, వెంకటరామ రాజు, సుబ్బలక్ష్ముమ్మ, రామ చంద్రయ్య, శ్రీను, సుబ్బరామ రాజు, జి.నారాయణ, రాజంపేట జనసేన నాయకులు మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, ఆకుల చలపతి, పివిఆర్ కుమార్, చిట్టే భాస్కర్, మౌలా తదితరులు పాల్గొన్నారు.