ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ సుంకర సాయిబాబా అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా శ్రీ సుంకర సాయిబాబా మాట్లాడుతూ యేసు ప్రభువుని దీవెనలతో ప్రజలందరూ కరోనా నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, మరియు జనసేన నాయకులు ఆంజనేయులు వల్లంశెట్టి, పిల్లి రాజేష్, అరవింద్ బాబు ముత్యాల, కంకట సురేష్, సురే ఏడుకొండలు, చన్నంశెట్టి మురళి, మేడిశెట్టి సుబ్బారావు, ముత్యాల సురేష్, నరేంద్ర పోకల, భూపతి రమేష్, మాల్యాద్రి నాయుడు, ఈదుపల్లి నాగరాజు మరియు జనసేన వీరమహిళలు ప్రమీల, కోమలి, ఉష తదితరులు పాల్గొన్నారు.