గువ్వల దొడ్డి గ్రామ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: రాహుల్ సాగర్

గువ్వల దొడ్డి గ్రామ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, డిమాండ్ చేశారు. జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ సాగర్, మాట్లాడుతూ 2011 నుంచి న్యాయం కోసం ఎదురు చూస్తున్న గువ్వల దొడ్డి, గ్రామ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని 115 ఎకరాల భూమిని త్యాగం చేసినా కూడా పరిహారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిలో రైతులు ఉండడం చాలా బాధాకరమైన విషయం అని కాయకష్టం చేసుకొని బ్రతికే రైతులు ఇటు భూములు లేక డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు హామీలు ఇవ్వడం కాదు హామీలు నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాడడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.