ఉద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం: జయరామిరెడ్డి

అనంతపురం, ప్రభుత్వ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఒప్పందఉద్యోగుల్ని వైసీపీ ప్రభుత్వం నిలువునా ముంచేసిందని.. సీపీఎస్ అంటే ఏంటో ముఖ్యమంత్రి కాకముందు తెలియదని పేర్కొనడం హాస్యాస్పదమని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు విధివిధానాలకి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విధి విధానాలకి తేడా ఏమి కనబడడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇద్దరూ ఒకే విధంగా నడుచుకుంటున్నారని హామీలు ఇవ్వడం, మోసం చేయడం ఈ రెండు పార్టీల విధానమని స్పష్టం అయింది అన్నారు. ప్రభుత్వాన్ని నడిపించే ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారులకు మాత్రం అప్పనంగా లక్షలకు లక్షలు దారపోయటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.