లంకలపల్లి, గోపాలపురం గ్రామాల్లో జనం కోసం జనసేన

జీలుగుమిల్లి మండలం, లంకలపల్లి మరియు గోపాలపురం గ్రామాల్లో ఆదివారం జనం కోసం జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో ఉండే సమస్యలను ప్రతి ఇంటికి తిరిగి ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను మేనిఫెస్టోను వివరించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి జనసేన రైతు భరోసా కార్యక్రమం గురించి కూడా వారికి వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి 2024లో తప్పకుండా గ్లాస్ గుర్తుకి ఓటు వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ బాలరాజు, కార్యదర్శి వీరంకి వెంకటేశ్వరరావు, ప్రచార కార్యదర్శి సిరి పండు, కుంజా రమేష్, కుంజా సోమరాజు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.