ప్రథమ పౌరుని హోదాలో తొలిసారిగా ఓటేసిన గవర్నర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రథమ పౌరుని హోదాలో తొలిసారిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం రాజ్భవన్కు సమీపంలోని చుండూరి వెంకట రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో గవర్నర్ దంపతులు ఓటేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమని, ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సమాజంలో మార్పు రావాలంటే ఓటు హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి అని అన్నారు. స్థానిక ఎన్నికలైన, మున్సిపల్ ఎన్నికలైన, జనరల్ ఎన్నికలైనా… ఓటు హక్కును వినియోగించుకోవడం తమ బాధ్యత అన్నారు. ఈ రాష్ట్ర ప్రధమ పౌరుడిగా బాధ్యతతో తన ఓటు హక్కును వినియోగించుకున్నానని, అందరూ వినియోగించుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు.