తెలంగాణలో క్రమంగా పెరుగుతోన్న చలి తీవ్రత

రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఆదిలాబాద్‌లో నిన్నమొన్నటి వరకు 17 నుంచి 20 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మంగళవారం 14.7 డిగ్రీలకు పడిపోయింది. భద్రాచలంలో 16.6, హైదరాబాద్‌లో 17.2, రామగుండంలో 17, మెదక్‌లో 16.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరోవైపు.. రాష్ట్రంలో గురువారం ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

కేంద్రం కనిష్ఠం గరిష్ఠం

ఆదిలాబాద్‌ 14.7 31.8

సంగారెడ్డి 16.0 29.0

ఖమ్మం 17.0 30.0

హైదరాబాద్‌ 17.2 30.1

నిజామాబాద్‌ 18.5 31.1

వరంగల్‌ 19.0 30.5

నల్లగొండ 19.0 31.5