పుంగనూరులో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పుంగనూరు టౌన్ బస్టాండ్ సర్కిల్ నందు పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు డీకే చైతన్య ఆదికేశవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పేదలకు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం మరియు మిఠాయి పంపిణీ జరిగింది. జనసేన-తెలుగుదేశం-బిజెపి కలిసి ఈ కార్యక్రమం చేసి ఉమ్మడి అభ్యర్థి అయిన చల్లా రామచంద్రారెడ్డిని అన్ని పార్టీలు కలిసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అందరూ ఏకతాటి పైన నిర్ణయించుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు చంద్రబాబు నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు కేవీ రమణ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు, రాయలసీమ లీగల్ సెల్ సభ్యులు సి వి శ్రీనివాస్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అరుణ, రూరల్ అధ్యక్షులు పాములహరి చౌడేపల్లి అధ్యక్షులు హేమంత్, సదుం అధ్యక్షులు నాగ తేజ, సోమల అధ్యక్షులు భూషణ్ రాయల్ మరియు తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.