జుజ్జూరులో ఘనంగా జనసేనాని జన్మదినోత్సవ వేడుకలు

  • జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జుజ్జూరులో భారీ రక్తదాన శిబిరం

నందిగామ నియోజకవర్గం: వీరులపాడు మండలం, జుజ్జూరు గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం మహాత్మాగాంధీ విగ్రహానికి, పొట్టి శ్రీరాములు విగ్రహనికి పుల మాలలు వేసి భారీ రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ గాంధీ, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బోలియశెట్టి శ్రీకాంత్ నాయకులు వచ్చి మంచి కార్యక్రమం చేస్తున్న కార్యకర్తలను అభినందించారు. ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పార్టీకి, ఊరికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని రావాలని, అలాగే పార్టీని కూడా బలోపేతం చెయ్యాలని కార్యకర్తలకు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో రమేష్, నాలుగు మండల అధ్యక్షులు జయరాజు, నాయని సతీష్, రామారావు మరియు కార్యకర్తలు పసుపులేటి వరకుమార్, రంగీసెట్టి సత్య, అరవింద్, గోపిశెట్టి కోటయ్య, రామశెట్టి మణికంఠ, పులిబండ్ల దుర్గా శెట్టి, బిజెపి మండల అధ్యక్షులు కంచి సుబ్బారావు, జనరల్ సెక్రటరీ జోగా, పొన్నవరం వార్డ్ మెంబర్ శ్రీనివాసరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.