డాక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

రాజోలు నియోజకవర్గం: మలికిపురంలో జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారి కటౌట్ కు జనసేన పార్టీ వీరమహిళలతో గురువారం రక్షాబంధన్ కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమంలో వీరమహిళలు అందరూ పాల్గొని పవన్ కళ్యాణ్ కటౌట్ కు రాఖీ కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు గుండబోగులు పెద కాపు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మోహన్ కుమార్, గుబ్బల రవికిరణ్, రంగరాజు, జనసేన నాయకులు కాళిదాసు, రావూరి నాగు, బైరా నాగరాజు ఈ పార్టీ దీపాటి మిథున్, తదితరులు పాల్గొనడం జరిగింది.