డాక్టర్ కందుల ఆధ్వర్యంలో ఘనంగా నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలు

విశాఖ దక్షిణ నియోజకవర్గం, రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో పెను మార్పులు సంభవించనున్నాయని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. గురువారం అల్లిపురంలో తన కార్యాలయంలో
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేనలకు వచ్చిన తర్వాత పార్టీలో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో నాదెండ్ల మనోహర్ చేసిన కృషి అమోఘమని తెలిపారు. ఆయన దూర దిష్టి, ప్రజ్ఞ, రాజకీయ అనుభవం పార్టీకి ఎంతో దోహద పడిందని వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో మాత్రం జనసేన పార్టీ తన మార్కును చూపించబోతున్నట్లు జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు వీల్ చైర్ లను అందజేశారు.

  • పవనన్న ప్రజాబాట 16వ రోజు

డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గంలో చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం గురువారం నాటికి 16 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 32 వ వార్డులోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. పలువురిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, తెలుగు అర్జున్, తెలుగు లక్ష్మి, ఎర్రంశెట్టి సురేష్, లంక త్రినాధ్, గరికిన రవి, శ్రవణ్, నాగలక్ష్మి, రూప, త్రినాధ్, మంగ, లలిత, గాజుల శ్రీను, పి.హైమావతి, వంశీ, జానకి, కుమారి, రాజేశ్వరి, పల్లా సూర్యనారాయణ, హరి, కందుల బద్రీనాథ్ కందుల కేదార్నాథ్ తో పాటు కె.ఎన్.ఆర్. చారిటీ ట్రస్ట్ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.