మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం జనసేన పార్టీ నందు జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య సమితి అవార్డు గ్రహీతమేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా రాజానగరం మండలం, కోరుకొండ మండలం, సీతానగరం మండలాల జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీ సంఖ్యలో మేడ గురుదత్ ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా నూతన సంవత్సర వేడుకల్లో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ క్యాలెండర్ ను గురుదత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్, రాజానగరం నియోజకవర్గం వీర మహిళ కందికట్ల అరుణ కుమారి, సీతానగరం కో కన్వీనర్ కాత సత్యనారాయణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.