ఘనంగా కామిశెట్టి రమేష్ జన్మదిన వేడుకలు..

గురజాల: మానవత్వం కలిగిన వ్యక్తి, సహాయానికి మారు పేరు, ఎవరికి రక్తం కావాల్సి వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చే దాత.. పిడుగురాళ్ళ జనసేన పార్టీ అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ జన్మదిన వేడుకలు పట్టణంలో అట్టహాసంగా నిర్వహించారు.. కార్యక్రమంలో
ముందుగా జనపాడు జనసేన నాయకులు ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్, అంబటి సాయి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేక్ కటింగ్ తో సంబరాలు మొదలుపెట్టగా కార్యక్రమంలో యాభై మందికి పైగా పాల్గొన్నారు.. ఉదయం 10 గంటలకు పట్టణ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.. గురజాల నియోజకవర్గ జనసేన ఐటీ కోఆర్డినేటర్ మునగ వెంకట్ కామిశెట్టి రమేష్ తో కేక్ కటింగ్ చేయించారు.. అనంతరం జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసిం సైదా పుష్ప గుచ్ఛం యిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గుర్రం కోటి బ్రదర్స్ శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ నాపై ఇంత ప్రేమ చూపించినందుకు ప్రతిఒక్కరకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే అందరం కలిసి పార్టీ ఉన్నతకి కష్టపడదామని అన్నారు. సామాజిక మద్యమాలలో మరియు ఫొన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.