ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభం

కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ నూతన కార్యాలయం కాకినాడ రూరల్ మండలం వలసపాకల గంగరాజు నగర్ రోడ్డు నెంబర్ ఒకటిలో గురువారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి నూతన కార్యాలయంలోకి నియోజకవర్గ జనసేన, టీడీపీ, భాజాపా పార్టీ ముఖ్య నాయకులతో, ప్రముఖులతో, జనసైనికులు, వీర మహిళలు, మిత్రులు శ్రేయోభిలాషులతో కలిసి జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంచార్జీ పంతం నానాజీ ప్రవేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిక్కాల రామచంద్రరావు, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, పేరాబత్తుల రాజశేఖర్, వి వై దాసు, చప్పిడి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, బీజేపీ నాయకులు పైడా కృష్ణ మోహన్, యార్లగడ్డ రాంకుమార్, రంభాల వెంకటేశ్వరరావు, పైడా భవన్ ప్రసాద్ భీమశంకర్, జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.