దేశంలో అతి పెద్ద కుంభకోణం జగనన్న ఇళ్ళ పధకం: పాలవలస యశస్వి

విజయనగరం: దేశంలో అతి పెద్ద కుంభకోణం జగనన్న ఇళ్ళ పధకం అని చిన్న పిల్లలను అడిగినా చెబుతారని, పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడంలో దేశంలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్ ఉందని, వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఇళ్ళు మరియు టీడ్కో ఇళ్ళ నిర్మాణంలోని డొల్లతనాన్ని నిర్లక్ష్య వైఖరిని ప్రజల ముందుకు తీసుకొని రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ చేపట్టిన డిజిటల్ కాంపెయిన్ లో భాగంగా ఆదివారం విజయనగరంలోని కొండకరకం గ్రామం నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో ఆ పార్టీ వీరమహిళలు, నాయకులు మరియు జనసైనికులు తరలిరాగా జగనన్న ఇళ్ళ నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ డిజిటల్ క్యాంపైన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం నాయకులు డా. మురళి మోహన్, మోపాడ అనిల్, దాసరి యోగేష్, శ్రీమతి మాత గాయత్రి, బొబ్బది చంద్రు నాయుడు, కిలారి ప్రసాద్, శ్రీనివాస్ మాస్టారు, సైలాడ అనిల్ మరియు దుప్పాడా, కొండకరకం జనసైనికులు పాల్గొన్నారు.