ఏలూరు జనసేన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఏలూరు నియోజకవర్గం: ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా రెడ్డి అప్పల నాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షత వహించారు.. జనసేన పార్టీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ రాఘవయ్య చౌదరి, సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి, రెడ్డి అనురాధ, బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్డి అప్పల నాయుడు జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బి.ఆర్. అంబేద్కర్ గారి యొక్క సారధ్యంలో భారత దేశ రాజ్యాంగ నిర్మాణంలో ప్రపంచంలోనే అతి బలమైన రాజ్యాంగాన్ని నిర్మించి ఆరోజు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా విభిన్నమైన ఒక చట్టం దుర్మార్గమైన ప్రభుత్వాలు ముఖ్య మంత్రులు లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆ చట్టాలను కాలరాస్తు బలమైన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పాలకులు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆ రోజుల్లో ఏదైతే తెల్లదొరల పాలన నుండి విముక్తి చెంది దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే భ్రమలోనే ఈ దేశ ప్రజలు జీవిస్తున్నారు. కానీ నేడు దేశంలో డా.బి.ఆర్.అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ నేటి నల్లజాతి పాలకులు నియంతన పాలనా అందిస్తున్నారు. ఈరోజుల్లో ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు, ప్రజల హక్కు కాలరాస్తు ప్రజా సంపదను కొల్లగొడుతూ వారి స్వేచ్ఛ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ప్రజాసంఘాలు కానీ, ప్రతిపక్షాలు, మేధావి వర్గాలు, నాయకులు, విద్యార్థులు ఈ యొక్క న్యాయవ్యవస్థ గాని రాజ్యాంగం గురించి మాట్లాడే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి జనసేన పార్టీ తరఫున జనసైనికులకు, వీరమహిళలకు, మెగా అభిమానులకు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు మరో పోరాటంలో ప్రజలందరూ సిద్ధం కావాలని, భారత రాజ్యాంగాన్ని బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ సంపదను ప్రజలకు అందే విధంగా మనం నిరంతరం పోరాటానికి సిద్ధం కావాలని తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, పల్లి విజయ్, కావూరి వాణిశ్రీ, కోశాధికారి పైడి లక్ష్మణరావు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, కూర్మా సరళ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, మీడియా ఇంచార్జీ జనసేన రవి, చిత్తరి శివ, కోలా శివ నాయకులు సోషల్ సర్వీస్ మురళి, బోండా రాము నాయుడు, వీరంకి పండు, బుధ్ధా నాగేశ్వరరావు, నూకల సాయి ప్రసాద్, గొడవర్తి నవీన్, నిమ్మల శ్రీనివాసరావు, బాబు, భూపతి, వంశీ, సాయి రాం సింగ్, కర్ర టవిటి రాజు, 2 టౌన్ మహిళ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ సుజాత, సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, గిడుతూరి పద్మ, గాయత్రి, పావని తదితరులు పాల్గొన్నారు.