జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నియంత పాలన సాగుతుందని, నిజమైన రాజ్యాంగ విలువలు, చట్టాలు అమలు కావాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల/పట్టణ అధ్యక్షులు, నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.