పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈరోజు ఈ ప్రత్యేకమైన రోజున జరుపుకోవడానికి మనమందరం ఇక్కడికి సమావేశం అవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన దేశం బలమైన దేశంగా ముందుకు సాగడానికి ఈ రోజు మనందరికీ ధైర్యాన్ని స్ఫూర్తిని ఇస్తుందన్నారు. రిపబ్లిక్ అంటే దేశంలో నివసించే ప్రజల అత్యున్నత శక్తి దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి రాజకీయ నాయకులుగా తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు మాత్రమే ఉందన్నారు. ఆ హక్కును సరైన మార్గంలో వినియోగించగా పోవడం వలన ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో అన్ని అరాచకాలు ఎస్సీ ఎస్టీ కేసులు తప్ప ప్రజలకు ఎటువంటి సహాయాన్ని కూడా అందించలేదని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో జనసేన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎం వెంకటేశ్వరరావు, భాస్కర పంతులు, కత్తి సుబ్బరాయుడు, దినకర్ బాబు, గోపి, ఆచారి, గోప తదితరులు పాల్గొన్నారు.