పుట్టపర్తి విమానాశ్రయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి. వరుణ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ తదితరులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విమానాశ్రయం నుంచి కొత్తచెరువులో ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి బయల్దేరారు.