ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో జాతిపితకు ఘననివాళి

ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ ఆభిప్రాయాలు మేలైనవని అతను చెప్పినట్లుగా సత్యం-అహింసలను దృష్టిలో ఉంచుకొని అన్యాయంపై పోరాడాలని కార్యకర్తలను సూచించారు. అలాగే దేశం భవిష్యత్తు అంతా గ్రామాలలోనే ఉంటుందని, కానీ నేటి ప్రభుత్వ ధోరణులు గ్రామాలను అభివృద్ధికి దూరం చేస్తున్నాయని ఆనాడు గాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జనసేన పార్టీతో మాత్రమే సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పైడి మురళీమోహన్, రాజశేఖర్, శ్రీనివాస్ రావు, కోటి, రాము తదితరులు పాల్గొన్నారు.