తలసేమియా వ్యాధి బాధిత పిల్లలకి మనోధైర్యాన్నిచ్చిన గుంత అనూష

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణం వైరా రోడ్డులో గల సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి తలసేమియా వ్యాధి బారిన పిల్లలకి రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఈమధ్య కాలంలో వారికీ రక్తం దొరకటం చాలా కష్టంగా మారింది ఈ విషయాన్ని సంకల్ప ట్రస్ట్ సభ్యులు ఖమ్మం జిల్లా జనసేన పార్టీ నాయకురాలు గుంత అనూష చెంతకు తీసుకరావటం, వెంటనే స్పదించిన అనూష సంకల్ప ట్రస్ట్ లో గల చికిత్స పొందుతున్న పిల్లలని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపి భవిష్యత్ లో ఎలాంటి సాయం కావాలన్నా నేను ముందు ఉంటా అని భరోసా ఇచ్చారు.