జనసేన నేత గునుకుల కిషోర్ హౌస్ అరెస్ట్

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. టిడిపి శ్రేణుల బంద్ కి మద్దతుగా నిలబడమని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడంతో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా ధర్నాలు, బంద్ లు చేయడం, వాటికి మద్దతు తెలపడం కూడా కట్టడి చేసి ప్రతిపక్షాల నోరు నొక్కి ఈ జగన్ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోందని పేర్కొన్నారు.