టోల్ ప్లాజా కార్మికులకు అండగా జనసేన

నక్కపల్లి మండలంలో, వెంపాడు వద్ద వున్న టోల్ ప్లాజా క్రొత్త యాజమాన్యం ఒక్కసారిగా 26 మంది సిబ్బందిని తొలగించడం జరిగింది. దీనిని ఖండిస్తూ.. టోల్ ప్లాజా కార్మికులకు అండగా అన్ని పార్టీల పెద్దలతో కలిసి జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలతో పాటూ.. పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి మరియు జనసైనికులు పాల్గొన్నారు.