గుంతల గూడెం- మన తాడేపల్లిగూడెం

  • తాడేపల్లిగూడెం జనసేన-టిడిపి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

తాడేపల్లిగూడెం: జనసేన పార్టీ – తెలుగు దేశం పార్టీ ఉమ్మడిగా చేపట్టిన కార్యక్రమం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం – గుంతల రాజ్యం గోతుల రాజ్యం “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” అనే పేరుతో ఉమ్మడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు రాజేష్ మాట్లాడుతూ జగన్ పాలన మొత్తం అవినీతిమయంగా మారిపోయిందంటూ, నేతలు సైతం దోచుకోవడంలో నిమగ్నమై పోయారంటూ విమర్శించారు. రాష్ట్రంలో రహదారులపై గోతులు చెరువులను తలపిస్తున్నాయనీ రహదారులపై గోతులు కూడా పూడ్చలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందనీ స్థానిక మన జనసేన నాయకులు, జనసైనికులు గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో పట్టణంలో సొంత ఖర్చులతో మరమ్మత్తు పనులు చేశామని ఈ ప్రభుత్వం నికి మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఇంకా మొద్దు నిద్ర వీడలేదని ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కుతో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి తాడేపల్లిగూడెం అభివృద్ధికి సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ వలవల బాబ్జి మాట్లాడుతూ.. నాగున్నరేళ్లుగా నిర్వహణ లేక రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రోడ్లను చూస్తూ వైసీపీ నాయకులు నిద్రపోయారనీ ప్రజల కష్టాలు గాలికి వదిలేశారని 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని జనసేన, టిడిపి కలిసి ఉమ్మడిగా వచ్చే ఎన్నికల్లో సైకో జగన్‌ను గద్దెదింపుతాం అని బాబ్జి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి సమన్వయకమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.