జనసేన కార్యకర్త దేవా కుటుంబ సభ్యులను పరామర్శించిన నాయుడు

పిఠాపురం: ఏ. కొత్తపల్లి గ్రామంలో బుధవారం విద్యుత్ ప్రమాదానికి గురై దురదృష్టవశాత్తు మరణించిన జనసేన పార్టీ కార్యకర్త దేవా ప్రసాద్ ఉమ్మిడి కుటుంబ సభ్యులను తొండంగి మండల జనసేన పార్టీ అధ్యక్షులు నాయుడు జనసేన పార్టీ తరుపున సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ ఒక మంచి కార్యకర్తను కోల్పోయిందని, పార్టీ తరుపున క్రియాశీలక సభ్యత్వం ద్వారా వర్తించే ప్రమాద భీమా క్లెయిమ్ కి పంపిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ. కొత్తపల్లి గ్రామా అధ్యక్షులు చిన్న, మండల ప్రధాన కార్యదర్శి నల్ల రాము, సొసైల్ మీడియా కన్వీనర్ రాంప్రసాద్ నాయుడు, తూము గణేష్, సూర్యచంద్ర, తొండంగి గ్రామ అధ్యక్షులు ఎలుగుబంటి నాగు, పి. చిన్నయ్యపాలెం అధ్యక్షులు వీసంఆనందరావు, సూరిబాబు నరహరిశెట్టి, బెండపూడి అధ్యక్షులకోరుకొండ శివ, అదేపల్లి బాలాజీ, చమవరం రాంబాబు, ఇళ్ల హరీష్, తదితర స్థానిక జనసైనికులు పాల్గొని సంతాపం తెలిపారు.