ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న గునుకుల కిషోర్

నెల్లూరు, ఈస్టర్ పండుగ సందర్బంగా నెల్లూరు సిటీ సెయింట్ జోసెఫ్ చర్చి నందు జరిగిన ప్రత్యేక ప్రార్థనలో జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు గెలవాలని పవన్ కళ్యాణ్ ప్రజా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం రావలసిందిగా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మం దారి తప్పిన రోజు తిరిగి దేవుడు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తాడు అనే నమ్మకానికి నిదర్శనం ఈస్టర్ పండుగ. లోకంలో చెడును, మరణాన్ని జయించి యేసు పునరుత్థానం ఈస్టర్ పండుగ సందర్బంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్ తో వర కుమార్, మౌనీష్, చిన్న రాజా, ప్రసన్న, హేమచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.