కలువాయి మండలం జనసేన ఆత్మీయ సమావేశం

వెంకటగిరి నియోజకవర్గం, కలువాయి మండలంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలువాయి మండల జనసేన నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహానుభావులు మార్గంలో నడిచే నాయకులు పవన్ కళ్యాణ్, ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని కలువాయి బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాధికారాన్ని అన్ని వర్గాల వారికి అందించాలనేదే ఆయన తపన, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని సమాజ సేవ కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ ని 2024లో సీఎం చేసుకునే విధంగా ప్రతి జనసైనికుడు తోడ్పడాలని మండలంలోని ప్రతి గ్రామానికి పార్టీ యొక్క సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, భావజాలాలను తీసుకెళ్లే విధంగ జన సైనికులు కృషి చేయాలని చర్చించారు. సమస్యలపై జనసైనికులు గళం ఎత్తాలని కోరారు, రానున్న రోజుల్లో జనసైనికులు అందరూ సమిష్టిగా నిలబడి జనసేనని పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా కూడా వారిని గెలిపించేందుకు అందరూ సహాయ సహకారాలు అందించాలని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి కలువాయి మండల జనసేన నాయకులు, వీరమహిళ ప్రవళిక, శ్రీహరి, వెంకటపతి, రామ కిషోర్, నరేష్, రామకృష్ణ, అనంతసాగరం మండలాధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.