నెల్లూరు రూరల్ నందు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గునుకుల కిషోర్

నెల్లూరు: అబౌండెడ్ చర్చ్, కొండాయపాలెం, నెల్లూరు రూరల్ నందు సోమవారం క్రిస్మస్ వేడుకల్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరోపకాలం అలవాటు చేసుకోవాలని.. అదే సామాజిక విలువలను పెంపొందిస్తుందని. చిన్ననాటి నుంచి నా గురువు గారైన టైటస్ నిర్మల్ కుమార్ మాకు బోధించారు. పవిత్ర క్రిస్మస్ నాడు దైవజనులు ప్రార్థిస్తూ దుఃఖముతో ఉన్న వారికి సంతోషం కలిగునట్లు అవమాన పడువారు కీర్తింపదగినట్టు.. లేని శబ్దం వినకుండా ప్రజలను కాపాడునట్లు ప్రజల దీవించమని దైవజనుల ప్రార్థనలు మన్నించి ప్రజలందరినీ సుఖసంతోషాలతో విరసిల్లాలని.. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, కరుణ, జాలి, దయా, కరుణ గుణాలు కలిగి ఉండాలని జీవితాంతం బోధించిన క్రీస్తు జీవితం మానవ జీవితానికి చిరస్మరణీయం సదాచరణీయం. అనేక మందికి సేవలు అందిస్తున్న మా టైటస్ నిర్మల్ కుమార్ జీవిత ఆయుష్షు కంటే నాలుగింతలు ఎక్కువగా జీవించి ప్రజలందరికీ సేవని కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. అనంతరం చిన్న పిల్లలకు సీట్స్ బహుమతులు పంచి ఇచ్చారు.