క్షతగాత్రులను పరామర్శించిన గురాన అయ్యలు

విజయనగరం జిల్లా, కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను విజయనగరం జిల్లా గురాన అయ్యలు సోమవారం పరామర్శించడం జరీగంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారని తెలుస్తోందని, గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ, రైల్వేశాఖ అధికారులను కోరుతున్నానని, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని, కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలని, ఈ ప్రమాదం పై సమగ్ర విచారణ చేపట్టాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.