గుమ్మల్ల శివరామయ్యకు అండగా పొన్నలూరు జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, కొండెపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుమ్మల్ల శివరామయ్య అనే వ్యక్తి గతంలో సకల సౌకర్యాలు అనుభవిస్తూ మంచిగా బ్రతికిన వ్యక్తి, పరిస్థితులు అనుకూలించక ప్రస్తుతం నాగిరెడ్డిపాలెం ద్వారం దగ్గర ఉన్నటువంటి సత్రంలో నివాసం ఉంటున్నాడు. అతనిని పట్టించుకునే నాధుడే లేడు, తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, చాలా రోజులు నుండి ఈ సత్రంలోనే నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గుమ్మల్ల శివరామయ్య అనే వ్యక్తికి దుప్పటి, లుంగీ, టవలు, ఒక జత బట్టలు, పండ్లు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యక్షులు కర్ణ తిరుమల రెడ్డి, ఐటి అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు ఇద్దరి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఇతనికి ఎల్లవేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, నవీన్, నందు మొదలైన జనసేన నాయకులు పాల్గొన్నారు.