పింఛను తొలగించిన బాధితులకు అండగా పాలకొండ జనసేన

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, కంబర గ్రామ కాపురస్థుడు కొండపల్లి స్వామి నాయుడు వాళ్ల కుమారుడు కొండపల్లి శివ కుమార్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, స్థానిక అధికార పార్టీ నాయకులు తన నెలవారీ పింఛను తొలగించారని స్థానిక నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయనతో పాటుగా నాయకులు కూరంగి నాగేశ్వరరావు (రిటైర్డ్ ఎస్.బి.ఐ బ్యాంక్ మేనేజర్) తో బాధితుల గ్రామం వెళ్లి బాధితుల ఆవేదన విని తమ పింఛనులు తీయడమేంటని ప్రశ్నించారు. మరియు ఆ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చి, తమ ప్రస్తుత పరిస్థితి చూసి తమకు కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ వైసిపి పార్టీ నాయకులు అధికార బలంతో విలువలను తుంగలో కలుపుతూ కక్ష సాధింపులకు పూనుకుంటున్నారని రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ప్రజాస్వామ్యంలో విలువలు లేకుండా గుండాల రౌడీల తయారవుతున్నారని ఇలానే మునుముందు చేస్తే రాబోయే ఎలక్షన్ లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని ఇలాంటి కక్ష సాధింపులను ఇకనైనా మానాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ జనసైనికులు ఆబోతుల శివకృష్ణ, పిల్ల అజయ్ కుమార్, నక్క రాజశేఖర్, మరియు వివిధ మండల నాయకులు గర్భాపు నరేంద్ర, డోంపాక సాయి కుమార్, పి.సంతోష్, జల్లు సాంబాబు, సుమన్,ఆజాద్, రాయుడు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.