శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న గురుదత్
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ప్రెసిడెంట్ పరసావీధి రాము పాలతీర్థపు అప్పారావు, కొచ్చర్ల విశ్వేశ్వరరావు, తగరంపూడి దుర్గా చార్యులు, కొచ్చర్ల చక్రపాణి, గంగులకుర్తి రాజా, కొచ్చర్ల రామకృష్ణ కొచ్చర్ల బాబి ల పిలుపు మేరకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత శ్రీ మేడ గురుదత్ ప్రసాద్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కళ్యాణ మహోత్సవానికి 5,000 రూపాయలు విరాళముగా ఇవ్వడం జరిగింది. బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన గురుదత్ ప్రసాద్ ను విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున సంఘం పెద్దలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల కమిటీ ప్రధాన కార్యదర్శి పోసిబాబు, ఆకుల ఆదిత్య, కోటిబాబు, కోరుకొండ మండలం సీనియర్ చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, తొరటి దుర్గా, తెలగంశెట్టి శివ, అడపా అంజిబాబు సంఘ పెద్దలు, జనసైనికులు పాల్గొన్నారు.