గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 13వ రోజు

పాలకొండ, జనసేనపార్టీ అధ్వర్యంలో ఆదివారం ఉదయం బొడ్లపాడు గ్రామంలో పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి సరస్వతి దేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాత్మా గాంధీజీ విగ్రహానికి, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్ర పటానికి పువ్వుల మాలవేసి జయంతి వేడుకలని ఘనంగా నిర్వహించారు. పాలకొండ నియోజకవర్గఒ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు షేక్ ఆజాద్ ఆర్ధిక సహకారంతో ఒకటి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్ధిని, విద్యార్ధులకు బుక్స్, పెన్నులు, కంపాస్ బాక్స్ లు, పేడ్స్ తో పాటు 10వ తరగతి విద్యార్థులకు అల్ ఇన్ ఒన్ మెటీరియల్ అందించారు. ఆజాద్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకొని మీ తలిదండ్రులకు, మీ పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. జనసేన జానీ, మత్స పుండరీకం మాట్లాడుతూ ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి లాంటి ఎందరో మహనీయుల త్యాగాలఫలితమే నేడు మనమంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామని, అహింసే ఆయుధంగా చేసుకుని అనాటి తెల్లదొరల నిరంకుసత్వ పాలనకు చరమగీతం పాడిన మహనీయులను ప్రతీఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దత్తి గోపాలకృష్ణ, జామి అనిల్, వారాడ సతీష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.