గురువులే భావితరం నిర్మాతలు: రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రంలో మంగళవారం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ విశ్రాంత ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ నా చిన్నతనంలో విద్యను అందించిన గురువులను సత్కరించి ఇటువంటి సందర్భాలను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో తల్లిదండ్రులు తర్వాత సరైన మార్గంలో జ్ఞానం బోధించేది గురుదేవులు అంటూ గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరహ.. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ ఉపాధ్యాయునిగా మొదలై భారత రాష్ట్రపతిగా సేవలందించిన భారతరత్న శ్రీ సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సమాజ అభ్యున్నతిలో ప్రధానపాత్ర పోషించే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్బరామరాజు, రాఘవేంద్రరాజు, సుబ్బరాజు మరియు అన్నయ్యగారి రవీంద్ర, మదన్ మోహన్, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.