భోగి పండుగ శుభాకాంక్షలు: మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ.. భోగ భాగ్యాలనిచ్చే భోగి మంటల వెలుగులో మీ జీవితాలు ప్రకాశించాలని, ఈ భోగి మీ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మేడ గురుదత్ ప్రసాద్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కొత్తమునగాల గ్రామంలో జనసేన పార్టీ కోరుకొండ మండల కన్వీనర్ మండపాక శ్రీను ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అధ్యక్షతన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి సమక్షంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో సుమారు 200 మంది మహిళలు పాల్గొనగా వారికీ జనసేన పార్టీ తరుపున 200 మందికి ట్రోఫీస్ గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేశారు.. అలానే ముగ్గుల పోటీలలో ముగ్గురు విజేతలకు పట్టు చీరలను మేడ గురుదత్ ప్రసాద్, గంటా స్వరూప, మండపాక శ్రీను అందజేసారు. మునగాల గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమని మహిళల అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, చదువు నాగు, కోరుకొండ మండల ప్రధాన కార్యదర్శి పోసిబాబు, కొచ్చర్ల బాబీ, గంటా రామూర్తి, మండపాక మురళి, చల్లా ప్రసాద్, మండపాక హరి, గ్రామ పెద్దలు & జనసేన పార్టీ వీరామహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.