పనికిరాని ఈ ప్రజాప్రతినిధులు మనకెందుకు..? జనసేన వినూత్న నిరసన

గుడివాడ జనసేన పార్టీ నాయకులు సందు పవన్, పాలంకి సారధి బాబు ఆధ్వర్యంలో భోగి మంటల్లో వైసీపీ నేతల బొమ్మల్ని దగ్దం చేసారు ఈ సందర్భంగా.. సారధి బాబు, సందు పవన్, మాట్లాడుతూ ఇంట్లో పాతబడి ఎందుకూ పనికిరాకుండా ఉన్న కట్టెలను తగులబెట్టి భోగి మంటలు వేస్తాం.. ఆ వెచ్చదనంలో కొత్తదనాన్ని ఆహ్వానిస్తాం.. అలాగే ప్రజల ఓట్లతో గెలిచి ఎందుకూ పనికిరాకుండా ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులను ఆ భోగి మంటల్లో వేసి తగలేస్తున్నాం.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మాట్లాడుతుంటే వైసీపీ మంత్రులు.. తాడేపల్లి పాలేర్లు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.. ప్రజలు పని చేయండ్రా బాబు అని గెలిపిస్తే… ఈ మంత్రులు కేవలం నోటితో మాత్రమే పని చేస్తున్నారు. ఇలాంటి మంత్రులు మనకెందుకు దండగ.. అందుకే భోగి మంటల్లో ఈ పాత సామానుని కూడా పడేస్తున్నాం.. ఈ సంక్రాంతి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది కావాలని కోరుకుంటున్నాం.. వైసీపీ మంత్రులకు చివరిగా ఒకటేచెబుతున్నాం.. మీకు దమ్ముంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోండి.. చెత్తవాగుడు వాడుతూ అటూ ఇటూ కాని వేషాలు వేస్తే.. ప్రజలు మిమ్మల్ని ఈ భోగి మంటల్లో వేసి తగులబెట్టే రోజులు వస్తాయి, ఖబర్దార్ అని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, వీరమహిళలు.. షేక్ ఫాతిమా, గుడపాటి అనురాధ, స్థానిక నాయకులు షేక్ రబ్బాని, గంటా చైతన్య, కోన రామకృష్ణ, సాయిన నాని, అర్జా. కృష్ణ, పేర్ని రాము, కటారి గోపి, ఉరుసు చంటి, షేక్ అజిష్, పోలాస ఫణి మరియు జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.