ముగ్గుల పోటీలలో పాల్గొన్న పార్వతి నాయుడు

గురజాల: రాజుపాలెం మండలం, వీరమ్మ కాలనీ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లామహిళా రీజనల్ కోఆర్డినేటర్ బోనీ పార్వతి నాయుడు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసీం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల అధ్యక్షులు తోట నరసయ్య, తాడువాయి లక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు హనుమంతరావు, మండల సంయుక్త కార్యదర్శి కేదారి రమేష్, నియోజకవర్గ నాయకులు అంచులఅనేష్, మండల కార్యదర్శి వరప్రసాద్, గ్రామ అధ్యక్షులు శ్రీను బాషా, పి మళ్లీ, జి మళ్లీ, సైదారావు, శ్రీరామ్, తిరుపతిరావు, రమేష్, సతీష్, రవి కిషోర్, గోపి, వేణు, సతీష్ బాబు, మురళి, తోట నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.