పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో వర్ధన్ అనాధాశ్రమంలో అన్నదానం

  • ఘనంగా సాయి అద్విత్ పుట్టినరోజు వేడుకలు
  • సాయి అద్విత్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ

జనగామ: చిన్నం అశోక్ కుమార్ స్వరూప కుమారుడు సాయి అద్విత్ పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధాశ్రమంలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో అన్నదానం, పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వేమల్ల అభిలాష్ రెడ్డి పాములకుంట్ల మణిదీప్, రమేష్, మణిరాజ్, జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, నరేంద్ర పవన్, శివ, గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.