అద్దె వాహనాల యజమానుల సమ్మెకు జనసేన మద్దతు

కొత్తగూడెం: సింగరేణిలో అద్దె వాహనదారులు న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్జీ-2 ఏరియా అద్దె వాహన యజమానులు బుధవారం సమ్మెకు దిగారు. దీనికి జనసేన పార్టీ పూర్తి మద్దతు వహిస్తుంది. ఈ క్రమంలో గురువారం సింగరేణి అద్దె వాహనాల గురించి సమ్మె చేస్తున్న పార్టీ నాయకులు జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్, టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ ప్రధాన కార్యదర్శి విజయ్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి అనిత్ సోషల్ మీడియా సెక్రెటరీ భాష సెక్రటరీ మరియు నుద్దునూరి బాలకృష్ణలను పోలీసులు అడ్డుకొని స్టేషన్ కి తీసుకొని వెళ్ళి ఉదయం 9 గంటల నుంచి 4 వరకు మందలించి వదిలిపెట్టడం జరిగింది.