ఘనంగా శ్రీ కృష్ణ దేవరాయలు వర్ధంతి

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం మంగళవారం శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి సందర్భంగా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు రాజంపేట పాత బస్టాండ్ సర్కిల్ నందు గల శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అని రాయలసీమను రతనాల సీమగా మార్చిన మహారాజు. దక్షిణ భారత దేశం మొత్తాన్ని పరిపాలన చేసిన హంపి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వారు. ఆయన ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచే ధీరదిగ్గజం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం జనసేన కార్యకర్తలతో జనసేన నాయకులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నాయకులు శింగంశెట్టి నరేంద్ర ,మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు ఆకుల చలపతి, పివిఆర్ కుమార్, ఇడిమడకల రామా, పత్తి నారాయణ, కడవకూటి సుధాకర్, తోట సురేష్, చల్లా మధు, మౌలా, మన్నేరు వెంకటసుబ్బయ్య, పత్తి వెంకటసుబ్బయ్య, మల్లెం సుబ్బయ్య, పలుకూరి శంకర్, అబ్బిగారి గోపాల్, లతీఫ్, కిచ్చగారి శివయ్య, రాజా, దర్బార్, హరి, చిట్టే భాస్కర్, రామా శ్రీను, శివం, కొమ్మినేని తేజ, గుర్రంకొండ నరసింహులు, మార్కెట్ శివయ్య, కె. ప్రభాకర్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.